పదవి కోసం కాదు… ప్రజల కోసం. రాజకీయాల కోసం కాదు… సేవ కోసం.” అనే సిద్ధాంతంతో తన ప్రజా ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
ఏడుపాయల సాయి వర్ధన్ గౌడ్
జననం: 13-08-1998
విద్యార్హత: BBA (Graduation) ప్రజాసేవను కుటుంబ సంప్రదాయంగా భావించే కుటుంబంలో జన్మించిన ఏడుపాయల సాయి వర్ధన్ గౌడ్, చిన్నప్పటి నుంచే సమాజ సేవ, రాజకీయాల పట్ల ప్రత్యేకమైన ఆసక్తిని పెంపొందించుకున్నారు. తండ్రి ఏడుపాయల శ్రీనివాస్ గౌడ్ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల మధ్యనే జీవించే నాయకుడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సాయి వర్ధన్
తండ్రి మార్గదర్శకత్వం, ప్రజల పట్ల ఉన్న ప్రేమ, సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పం సాయి వర్ధన్ గౌడ్ను యువ నాయకుడిగా తీర్చిదిద్దాయి. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనే భావనతో ముందుకు సాగుతున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో పాటు జిల్లా స్థాయి నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. యువతలో సేవాభావాన్ని పెంపొందిస్తూ ప్రజలకు అండగా నిలవడమే తన రాజకీయ లక్ష్యంగా భావిస్తున్నారు.
ప్రజా సేవా కార్యక్రమాలు
ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడమే నిజమైన నాయకత్వమని నమ్మే సాయి వర్ధన్ గౌడ్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
– కోవిడ్ మహమ్మారి సమయంలో
మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు అనేకసార్లు రక్తదానం చేసి ప్రాణాలను కాపాడే సేవలో పాల్గొన్నారు.
– సుమారు 1000 మందికి పైగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఆహార పొట్లాల పంపిణీ నిర్వహించారు.
– ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు.
– యువతను ప్రోత్సహించే క్రీడా టోర్నమెంట్లను నిర్వహించారు.
– పేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించారు.
– మరణించిన కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల కోసం ఆర్థిక తోడ్పాటు అందించారు.
– ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద రోగులకు బిల్లుల విషయంలో సహాయం చేసి అవసరమైన చోట ఆర్థిక సహకారం అందించారు.
– అవసరమైన ప్రతి సందర్భంలో ప్రజలకు అండగా నిలుస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ప్రజా సంక్షేమమే కుటుంబ ధ్యేయం
“ప్రజల సేవే పరమావధి” అనే భావనతో జీవించే కుటుంబం ఏడుపాయల కుటుంబం. తండ్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించిన సేవా ప్రస్థానాన్ని మరింత విస్తరించాలనే సంకల్పంతో సాయి వర్ధన్ గౌడ్ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.
యువతకు ఆదర్శంగా నిలుస్తూ, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న సాయి వర్ధన్ గౌడ్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.