RAJU

డిష్ రాజు రాజకీయ ప్రస్థానం – సేవే లక్ష్యంగా సాగుతున్న ప్రయాణం

దుంపల రాజు (డిష్ రాజు) గారు 05-02-1986న మెదక్ జిల్లా చేగుంటలో శ్రీ దుంపల నరసింహులు, శ్రీమతి యాదమ్మ దంపతులకు జన్మించారు. నలుగురు సంతానంలో పెద్ద కుమారుడిగా జన్మించిన రాజు చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం, సేవాభావం మరియు నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు.

విద్యాభ్యాసం

రాజు గారు తన ప్రాథమిక మరియు పదవ తరగతి విద్యను జడ్పీహెచ్‌ఎస్, చేగుంటలో పూర్తి చేశారు. అనంతరం శంకరంపేటలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్లో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే కుటుంబ బాధ్యతలను అర్థం చేసుకుని, చదువుతో పాటు స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు.

వ్యాపార రంగంలో ఎదుగుదల

కష్టపడే స్వభావంతో డిష్ కనెక్షన్లు మరియు టెంట్ హౌస్ వ్యాపారాలను ప్రారంభించిన రాజు గారు చేగుంట ప్రాంతంలో విశేష గుర్తింపు సంపాదించారు. తన నిజాయితీ, నిబద్ధత, వినయంతో ప్రజల మన్ననలు పొందుతూ, క్రమంగా “డిష్ రాజు”గా ప్రజల నోట నిలిచిపోయారు. నేడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆయనను “డిష్ రాజు” అని పిలుస్తుంటారు.

సేవా కార్యక్రమాల్లో ముందంజ

డిష్ రాజు గారి జీవితంలో సేవకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం చేగుంట అమ్మవారి పలారం బండి రథోత్సవాన్ని స్వంత ఖర్చులతో ఘనంగా నిర్వహిస్తూ భక్తుల ప్రశంసలు అందుకుంటున్నారు.

అంతేకాకుండా:

అనాథాశ్రమాల్లో అన్నదానం, వస్త్రదానం

పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రి పంపిణీ

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సహాయం

బియ్యం, కూరగాయల పంపిణీ

హాస్పిటల్ ఖర్చులకు ఆర్థిక తోడ్పాటు

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో అవసరమైన సామగ్రి అందజేత

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన


వంటి అనేక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు.

యువతకు మార్గదర్శి

యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు డిష్ రాజు గారు గత ఐదేళ్లుగా చేగుంట క్రికెట్ లీగ్ (CCL) టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా గ్రామీణ యువతలో ప్రతిభను వెలికితీసి, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.

 

రాజకీయ రంగ ప్రవేశం

ప్రజల్లో డిష్ రాజు గారికి ఉన్న మంచి పేరు, సేవా కార్యక్రమాలు, ప్రజలతో మమేకమయ్యే తత్వాన్ని గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే Kotha Prabhakar Reddy గారు, చేగుంట సర్పంచ్ ఎన్నికల్లో ఆయన సతీమణి శ్రీమతి రమ్య గారిని అభ్యర్థిగా నిలబెట్టారు.

బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొన్నప్పటికీ కేవలం 16 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయింది అభ్యర్థి మాత్రమే కానీ, ప్రజల హృదయాల్లో డిష్ రాజు గెలిచారని చేగుంట ప్రజలు భావిస్తున్నారు.

ప్రజాసేవే ధ్యేయం

ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని భావించిన డిష్ రాజు గారు ఇప్పటికీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గ్రామాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై నిరంతరం పనిచేస్తున్నారు.

భవిష్యత్ రాజకీయ లక్ష్యం

రానున్న జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనే సంకల్పంతో ప్రజల మధ్య మరింత చురుకుగా పనిచేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, వారి ఆశయాలకు అనుగుణంగా తన కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.

ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలు, తనపై ఉన్న నమ్మకం తనకు విజయాన్ని అందిస్తాయని విశ్వసిస్తున్న డిష్ రాజు గారు, సేవా మార్గంలోనే ముందుకు సాగుతున్నారు. గ్రామాభివృద్ధి, యువత అభ్యున్నతి, పేదల సంక్షేమమే తన రాజకీయ ప్రయాణానికి ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు.

 

“పదవి కోసం కాదు… ప్రజల కోసం రాజకీయాలు” అనే నినాదంతో డిష్ రాజు గారి ప్రజా ప్రస్థానం కొనసాగుతోంది.

RAJU
RAJU
RAJU
RAJU
RAJU
RAJU
RAJU
RAJU
RAJU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *